ప్రస్తుతం టాలీవుడ్ లో కొరటాల, మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య మూవీపై కాపీ వివాదం నడుస్తుంది.ఈ సినిమా కథ తనదే అంటూ రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేస్తూ మీడియా ముందుకి వచ్చాడు.
అయితే ఈ సినిమా కథ కొరటాల సొంత కథ అని, దీనిపై వస్తున్న కాపీ ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక తాను మైత్రీ మూవీ నిర్మాతలకి తన కథని చెప్పడం జరిగిందని, వారు అప్పుడే కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తీద్దామని నాతో చెప్పడం జరిగిందని, అయితే దానికి అంగీకరించకుండా నేను వచ్చేసినట్లు చెబుతున్నాడు.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ వారి వెర్షన్ వేరుగా ఉంది.ఆ కథ తమకి నచ్చకపోవడంతో రిజక్ట్ చేయడం జరిగిందని తేల్చేశారు.
అయితే ఈ సినిమాపై మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతుంది.
గతంలో చాలా సినిమాలకి ఇలాంటి వివాదాలు వచ్చాయి.
చాలా మంది రచయితలు కూడా పలానా సినిమా కథ తమదే అంటూ హడావిడి చేశారు.అయితే అప్పట్లో ఆ అంశాలని పెద్దగా ఫోకస్ చేయని మీడియా ఇప్పుడు ఆచార్య సినిమాపై రచ్చ చేస్తున్నాయి.
అయితే ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగే ప్రయత్నం చేయడం గమనార్హం.ఎవరో వచ్చి ఒక నిర్మాతకి కథ చెబితే ఆ కథని కొరటాల కాపీ చేస్తే విమర్శలు చేయాల్సింది సదరు నిర్మాత, దర్శకుల మీద కానీ ఒక వర్గం మీడియా మాత్రం దీనిలోకి చిరంజీవిని లాగుతూ అతను ఈ వివాదంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే కథను కాపీ చేయడానికి చిరంజీవికి అసలు సంబంధం లేకపోయినా కూడా అతనిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ ఇష్యూని పెద్దది చేసి ఇండస్ట్రీకి ఇప్పుడు చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి ఆయనే ఈ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేయడం.దానిని మీడియా అదే పనిగా హైలెట్ చేసి చూపించడం అంతా చిరంజీవి ఇమేజ్ దెబ్బ తీయడానికే అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
.