ఎమ్మెస్‌ చనిపోయాడంటూ పుకార్లు

తెలుగు కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగా లేదనే విషయం తెల్సిందే.ప్రస్తుతం కిమ్స్‌లో ఎమ్మెస్‌ నారాయణ చికిత్స పొందుతున్నారు.

 Media Reports False Rumors On Ms Narayana Death-TeluguStop.com

అయితే ఉన్నట్లుండా కొన్ని చానెల్స్‌లో ఎమ్మెస్‌ నారాయణ చనిపోయాడంటూ వార్తలు రావడం జరిగింది.దాంతో ఆయన సన్నిహితులు అంతా కూడా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

అయితే ఎమ్మెస్‌ నారాయణ చనిపోయినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కొడుకు విక్రమ్‌ ఖండిరచాడు.

ఉదయం ఎమ్మెస్‌ నారాయణను పరామర్శించేందుకు పలువురు రావడంతో, ఆయన మృతి చెంది ఉంటాడని కొందరు మీడియా వారు ఊహించుకున్నట్లుగా తెలుస్తోంది.

అలా ఊహించుకుని బ్రేకింగ్‌ న్యూస్‌ వేయడంతో గందరగోళం మొదలైంది.ఎమ్మెస్‌ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్‌ వైధ్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయడం జరిగింది.

ఎమ్మెస్‌ నారాయణ మలేరియా మరియు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ప్రకటించారు.ఆయనకు సరైన చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube