తెలుగు కమెడియన్ ఎమ్మెస్ నారాయణ ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగా లేదనే విషయం తెల్సిందే.ప్రస్తుతం కిమ్స్లో ఎమ్మెస్ నారాయణ చికిత్స పొందుతున్నారు.
అయితే ఉన్నట్లుండా కొన్ని చానెల్స్లో ఎమ్మెస్ నారాయణ చనిపోయాడంటూ వార్తలు రావడం జరిగింది.దాంతో ఆయన సన్నిహితులు అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఎమ్మెస్ నారాయణ చనిపోయినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కొడుకు విక్రమ్ ఖండిరచాడు.
ఉదయం ఎమ్మెస్ నారాయణను పరామర్శించేందుకు పలువురు రావడంతో, ఆయన మృతి చెంది ఉంటాడని కొందరు మీడియా వారు ఊహించుకున్నట్లుగా తెలుస్తోంది.
అలా ఊహించుకుని బ్రేకింగ్ న్యూస్ వేయడంతో గందరగోళం మొదలైంది.ఎమ్మెస్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైధ్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
ఎమ్మెస్ నారాయణ మలేరియా మరియు లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు ప్రకటించారు.ఆయనకు సరైన చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.