ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.
ఈ మధ్య సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించి మళ్ళీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే మళ్ళీ ఇటీవలే సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.ఈ రోజు ఉదయం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యింది.ఇది కూడా శేఖర్ కమ్ముల మార్క్ కనిపించేలా ఉంది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య మీడియా ముందుకు ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తుంది.
అందుకు కారణం కూడా లేకపోలేదు.
కేవలం లవ్ స్టోరీ సినిమా ప్రొమోషన్ కోసం మీడియా ఎదురు చూడడం లేదు.నాగ చైతన్య సమంత మధ్య ఏం జరుగుతుందా అనే అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం మీడియా పీపుల్ ఎదురు చూస్తున్నారు.గత కొన్ని రోజులుగా నాగ చైతన్య సమంత మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ వారు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే.
ఈ మధ్యనే సమంత తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని నేమ్ మార్చడంతో అసలు ప్రాబ్లెమ్ స్టార్ట్ అయ్యింది.అప్పటి నుండి సమంత నాగ్ చైతన్య పై గాసిప్స్ వచ్చాయి.ఇక ఈ విషయంపై సమంత స్పందించిన అసలు విషయం మాత్రం చెప్పలేదు.
దీంతో ఈ వరకు నిజం అసలు వీరిద్దరూ మధ్య మనస్పర్థలు అనే విషయం అడగడం కోసం నాగ చైతన్య ఇంటర్వ్యూ కోసం మీడియా వాళ్ళు ఎదురు చూస్తున్నారు.మరి ఈ విషయంపై నాగ చైతన్య ఎలాగ స్పందిస్తారో వేచి చూడాలి.