వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే అనుమానంతో ….రాజంపేట టిడిపి శాసనసభ్యుడు,ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం అయిన సందర్భంగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే… టిడిపి నేతల సమావేశానికి తనను అహ్వానించలేదని ఇంతకుముందు మల్లిఖార్జున రె్డ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే మేడా పార్టీని వీడినంత మాత్రాన తమకు పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదని టిడిపి ఎంపీ సి.ఎమ్.రమేష్ అన్నారు.కాగా… ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేడ కలవబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు