అరటిపండు.తక్కువ ధరకే లభించినా.
ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే పండ్లలోనూ అరటిపండుదే మొదిటి స్థానం.
రుచిగా ఉండే అరటిపండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మరియు అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.జీర్ణసంబంధమైన సమస్యలతో బాధపడుతున్నవారు రోజుకు రెండు అరటిపండ్లు తింటే మంచి ఫలితం ఉంది.
ఇక కొందరు మాత్రం అరటి పండు తింటే బరువు పెరిగిపోతారని అనుకుంటారు.కాని, అది అపోహ మాత్రమే.
రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు.
అయితే అరటిపండ్ల విషయంలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే.
భోజనం తర్వాత తినడం.అది కూడా రాత్రి భోజనం తర్వాత చాలా మంది అరటిపండును తింటుంటారు.
కాని, అలా తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడుతుందని.
తద్వారా జలుబు చేసే అవకాశాలు ఎక్కువ.ఇలా చేసిన జలుబు అంత త్వరగా తగ్గదని చెబుతున్నారు.
అలాగే ఉబ్బసం, సైనస్ సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత అరటిపండు తింటే ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని అంటున్నారు.మరియు రాత్రి భోజనం తర్వాత అరటిపండు తింటే.
జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.సో.రాత్రి భోజనం తర్వాత అరటిపండు తీసుకోకపోవడమే మంచిది.అయితే మధ్యాహ్న సమయంలో భోజనం తర్వాత అరటి పండు తింటే ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు.