సోమాజిగూడ లోని జయ గార్డెన్ లో టి.ఆర్.ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్.
ఖైరతాబాద్ నియోజకవర్గం జయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన అన్ని కమిటీల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత కార్యకర్తలదే అని అన్నారు.దానం మాట్లాడుతూ నవంబర్ 15 న వరంగల్ లో జరగబోయే సింహ గర్జన సభలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కార్పొరేటర్ లు వనం సంగీత యాదవ్, మన్నే కవితారెడ్డి తో పాటు నియోజకవర్గ టి.ఆర్.ఎస్.కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.