మయాంక్‌ మాయతో దుమ్ము రేపిన టీం ఇండియా

ఇండియా బంగ్లాదేశ్‌ల మద్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ ఫలితం మొదటి రోజే తేలిపోయింది.తక్కువ పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్‌ చేసిన టీం ఇండియా బౌలర్లు మ్యాచ్‌ను ఇండియా వైపుకు లాక్కోగా బ్యాట్స్‌మన్‌ మొత్తం టెస్టు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు.

 Mayank Agarwal Getting Double Tone India Get High Score-TeluguStop.com

మయాంక్‌ తన కెరీర్‌లో రెండవ డబుల్‌ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్‌ ఫలితం మొత్తం ఇండియా వైపుకు వచ్చేసింది.ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 493 పరుగులు సాధించింది.

మయాంక్‌ 243 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.మూడవ రోజే ఆటను ముగించాలని టీం ఇండియా బ్యాట్స్‌మన్‌లు పట్టుదలగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.అందుకోసం మొదటి సెషన్‌ ఆడి డిక్లెర్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.స్కోర్‌ 550 వరకు చేస్తే భారీ స్కోర్‌ లక్ష్యం విధించినట్లవుతుంది.

తద్వారా వారిపై ఒత్తిడి ఉంటుందని టీం ఇండియా భావిస్తుంది.మూడవ రోజు కాకున్నా నాల్గవ రోజు ఆరంభంలోనే మ్యాచ్‌ ముగిసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించి మయాంక్‌ మరోసారి హీరో అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube