మహారాష్ట్రలో రెచ్చిపోయిన మావోలు

మహారాష్ట్రలోని గడ్చి రోలి జిల్లా లో మావోయిస్టు లు రెచ్చిపోయారు.పోలీసులనే లక్ష్యంగా చేసుకున్న మావో లు మందుపాతర పేల్చడం తో దాదాపు 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

 Mavoists Attack In Maharashtra-TeluguStop.com

వివరాల్లోకి వెళితే….బుధవారం కూబింగ్ కు వెళ్లిన ప్రత్యేక పోలీస్ దళం ప్రయివేట్ వాహనంలో తిరిగి వస్తున్న క్రమంలో మావోలు మందుపాతర పేల్చడం తో డ్రైవర్ సహా దాదాపు 16 మంది మృతి చెందారు.

ఈ ఘటన కు ముందే అదే జిల్లాలో జాతీయ రహదారిని నిర్మిస్తున్న జయదార్ అమర్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన 25 వాహనాలను కూడా మావోలు తగులబెట్టినట్లు తెలుస్తుంది.గతేడాది ఏప్రిల్ లో పోలీసులు జరిపిన ఎంకౌంటర్ లో 40 మంది మావోలను ఎంకౌంటర్ చేసిన క్రమంలో ప్రతీకారేచ్ఛ తో రగిలిపోతున్న మావోలు పోలీసులే లక్ష్యంగా ఈ మందుపాతర కు పాల్పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది అని వారు పేర్కొన్నారు

గడ్చిరోలీ జిల్లా లోని దాదాపూర్-ఎరకాడా ప్రాంతాల మధ్య 136 వ జాతీయ రహదారి పై రోడ్డు పనులను నిర్వహిస్తున్న జయదార్ అమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు చెందిన 25 వాహనాలను మావోలు తగులబెట్టినట్లు తెలుస్తుంది.బుధవారం తెల్లవారు జామున రోడ్డు పనులు చేస్తున్న 11 టిప్పర్లు,ఐదు ట్రాక్టర్లు,మరో నాలుగు యంత్రాలు,రెండు జనరేటర్లు పైన డీజిల్ పోసి మావోలు నిప్పంటించినట్లు తెలుస్తుంది.

అయితే మావోలు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube