నటి ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి మాలీవుడ్,కోలీవుడ్ సినిమాలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
కాగా ఐశ్వర్య కోలీవుడ్ హీరో విశాల్ నటించిన గార్గి సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యింది.అనంతరం ధనుష్ నటించిన జగమే తందిరం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య లక్ష్మి.
ఇక ఇటీవలే విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి.ఇది ఇలా ఉంటే తాజాగా విష్ణు విషయాలు లభించిన కట్టా కుస్తీ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కాగా కుస్తీ పోటీల్లో అలా నటించినందుకుగాను తన నటనకు పలువురు ప్రముఖుల నుంచి తనకు ప్రశంసలు లభిస్తున్నాయి అంటూ ఆనందం వ్యక్తం చేసింది ఐశ్వర్య లక్ష్మి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అంటే చాలా ఇష్టమని ఆమె తెలిపింది.
ఆయన నటన చూస్తూ పెరిగినట్లు ఆమె చెప్పుకొచ్చింది.అటువంటిది ప్రస్తుతం మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న క్రిస్టోఫర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో తాను ఒకరిగా నటించడం అన్నది జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ఆమె నటుడు దుల్కర్ సల్మాన్ కు జంటగా కింగ్ ఆఫ్ గోదా సినిమాలో కూడా కథానాయకగా నటించబోతున్నట్లు తెలిపింది.ఒకేసారి తండ్రీ కొడుకులతో కలిసి నటించడం నిజంగా అరుదైన అనుభవంగా చెప్పుకొచ్చింది లక్ష్మి.ఈ ఏడాది నిజంగా తనకు జీవితంలో గుర్తుండిపోయింది అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.సినిమాలు అన్ని హిట్ అవుతుండడంతో ఆమెకు కోలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు క్యూకడుతున్నాయి.