కొత్తదనంతో ఉన్న కథలకి ఎప్పుడూ కూడా ప్రేక్షకాదరణ ఉంటుంది.సినిమా కథ, కథనాలు బాగుంటే దానికి ఎంత బడ్జెట్ పెట్టారు, ఏ లొకేషన్స్ లో సినిమా షూట్ చేశారు.
రిచ్ లుక్ ఉందా లేదా అనే విషయాలని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు.విషయం ఉండి, రెండు గంటలసేపు సీటులో కదలకుండా కూర్చో బెడితే ఆ సినిమా ఆటోమేటిక్ గా హిట్ టాక్ తెచ్చుకుంటుంది.
ఈ విషయాన్ని తెలుగులో వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి.అందులో కేరాఫ్ కంచరపాలెం, మత్తు వదలరా లాంటి సినిమాలు కూడా ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కంచరపాలెం సినిమా ఇతర భాషలలో రీమేక్ అయ్యింది.ఇప్పుడు ఈ వరుసలో మత్తు వదలరా సినిమా కూడా వచ్చి చేరుతుంది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రితేష్ రాణా అనే నూతన దర్శకుడు మత్తు వదలరా అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా, మరో కుమారుడు కాలభైరవన సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి పని చేశారు.మర్డర్ మిస్టరీగా వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందింది.
ఈ చిత్రం హిందీ ప్రేక్షకులకి కూడా తప్పక నచ్చుతుందనే ఆలోచనతో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు చిత్ర దర్శకుడు రీతేష్ రానా ఇంగ్లీష్ మీడియాకి తెలిపాడు.సినిమాలో ఎవరెవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో తెలుగులో తెరకెక్కుతున్న కంటెంట్ బేస్ సినిమాలు అన్ని కూడా హిందీలోకి రీమేక్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ వరుసలో మత్తు వదలరా సినిమా కూడా వచ్చి చేరడం విశేషం.