బొత్స సత్యనారాయణకు మాతృ వియోగం

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి ఈశ్వరమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.

 Ap, Minister, Botsa Satyanarayana, Mother, Die-TeluguStop.com

వారి కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఆదివారం తెల్లవారు జమున ఆమె ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్ను మూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అయితే ఈశ్వరమ్మ వయస్సు 84 సంవత్సరాలు.ఆమెకు నలుగురు కూతుళ్లు, ఏడుగురు కొడుకులు మొత్తం 11 మంది సంతానం.వారిలో బొత్స సత్యనారాయణ పెద్ద కొడుకు, కాగా ఆమె రెండో కొడుకు అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తున్నారు.అయితే ఈశ్వరమ్మ దహన సంస్కారాలను విజయనగరంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

బొత్స తల్లి మరణ వార్త తెలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube