ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి ఈశ్వరమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
వారి కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఆదివారం తెల్లవారు జమున ఆమె ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో కన్ను మూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ఈశ్వరమ్మ వయస్సు 84 సంవత్సరాలు.ఆమెకు నలుగురు కూతుళ్లు, ఏడుగురు కొడుకులు మొత్తం 11 మంది సంతానం.వారిలో బొత్స సత్యనారాయణ పెద్ద కొడుకు, కాగా ఆమె రెండో కొడుకు అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తున్నారు.అయితే ఈశ్వరమ్మ దహన సంస్కారాలను విజయనగరంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
బొత్స తల్లి మరణ వార్త తెలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.