సదరన్ ఆఫ్రికా లోని ఈస్వతిని (గతంలో ఆ దేశం పేరు స్వాజీల్యాండ్) దేశాన్ని పరిపాలిస్తున్న మస్వతి-III అనే పేరు గల రాజు 15 భార్యలను పెళ్లి చేసుకొని 15 పిల్లలకు తండ్రి అయ్యాడు.అతను తన దేశంలో పేదరికం తో బాధపడుతున్న ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం తన భార్యకు విలాసవంతమైన కార్లను, వస్తువులను కొనిస్తుంటాడు.
ఈ రాజు తన దేశ నిధులనన్ని స్వప్రయోజనాలకు ఉపయోగిస్తూ ఉండడం ప్రస్తుతం ఆ దేశ ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది.ప్రతిపక్ష నేతలు కూడా మస్వతి-III ని బాగా తిట్టిపోస్తున్నారు.
దేశంలోని 63% ప్రజలంతా పేదరికంతో బాధ పడుతూ ఉంటే వారికి అండగా నిలవాల్సిన నువ్వే ఇలా నిధులను దోచేసుకుంటుంటే ఎలా అంటూ తీవ్ర స్థాయిలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీ యునైటెడ్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
గతంలో కూడా 19 విలువైన రోల్స్ రోయిన్స్ కార్లను చాలా కోట్ల రూపాయలు వెచ్చించి తన భార్యలకు బహుమతిగా ఇచ్చాడు.
అవి చాలదన్నట్టు ఒకరోజు 120 బీఎండబ్ల్యూ కార్లకు ఆర్డర్ ఇచ్చి ఆ దేశంలో సంచలనం సృష్టించాడు.ఈ 120 కార్ల విలువ భారతదేశ కరెన్సీలో 175 కోట్లు ఉంటుందని అంచనా.
అతడికి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్ పార్కింగ్ గ్యారేజ్ ఉందంటే అతిశయోక్తి కాదు.ఆ దేశ ప్రధానమంత్రి ఈ రాజు చేస్తున్న పనులకు ఏదో రకంగా సమర్థత ఇచ్చుకుంటుంటాడు.బీఎండబ్ల్యూ కార్ల గురించి తాను మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకి రాజులు తప్పకుండా కొత్త కార్లను కొనే ఆచారం ఎప్పటి నుంచే ఉన్నదేనని ఆయన చెప్పుకొచ్చాడు.
120 కార్లు లారీలలో రాజు భార్యల ఇంటికి డెలివరీ అవుతుండగా… ఆ దేశ జర్నలిస్టులంతా ఫోటోలు తీసి రాజు ప్రవర్తనపై అనేకమైన విమర్శలు చేశారు.అయితే వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రాజు భార్యల గ్యారేజీలో ప్రస్తుతం 20 మెర్సిడెస్ – మేబాచ్ ఎస్600 పుల్మ్యాన్, 62 మేబాచ్, బీఎండబ్ల్యూ X6 కార్లు ఉన్నాయని సమాచారం.
వీటితో పాటు కొన్ని ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయట.ఏది ఏమైనా ప్రజల కోసం ఉపయోగించాల్సిన ధనాన్ని మస్వతి-III రాజు తన భార్యల కోసం ఉపయోగించడం సరైనది కాదని నెటిజనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
భార్యలపై ప్రేమ ఉంటే తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి కానీ ప్రజల ధనాన్ని దోచుకుంటూ అందరి చేత తిట్టించుకుంటున్నాడు ఈ ఆఫ్రికన్ రాజు.