ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా థియేటర్లు బంద్ అయిపోయాయి.దీంతో ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు అన్ని కూడా ఓటీటీ బాట పడుతున్నాయి.
డిజిటల్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ చానల్స్ హవా మొదలైంది.పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.
ఒక మంచి కాంబినేషన్ సినిమాల కోసం చానల్స్ కూడా పోటీ పడుతున్నాయి.కోట్ల రూపాయిలు చెల్లించేందుకు డిజిటల్ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.
హిందీతో పాటు, తెలుగు, తమిళంలో చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నారు.తెలుగులో ఇప్పటికే వి సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.
అలాగే నిశ్శబ్దం కూడా ఓటీటీలో రిలీజ్ కి కాబోతుంది.వీటితో చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి.
ఇక తమిళంలో హీరో సూర్య ఓటీటీలో తన సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయనే ప్రచారం జరుగుతుంది.
ఇందులో ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా పేరు కూడా వినిపిస్తుంది.ఈ సినిమాపై వంద కోట్ల బేరం జరిగిపోయిందని, ప్రముఖ ఓటీటీ చానల్ పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ముందుకి రావడంతో ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటూ ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ ప్రచారానికి చిత్ర నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టారు.మాస్టర్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన లేదని తెలిపారు.కచ్చితంగా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని, ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో అప్పుడే సినిమా కూడా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా కేవలం థియేటర్ లో చూడాల్సిన సినిమా అని అన్నారు.
దీంతో మాస్టర్ సినిమా రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.