రోజు రోజుకు రంజుగా సాగుతున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్లో 9వ వారం కొనసాగుతోంది.ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, గంగవ్వ, సుజాత, కుమార్ సాయి, టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, నోయల్ బిగ్ బాస్ ఇంటి నుంచి బ్యాగ్ సద్దేయగా.
గత వారమే ఎలిమినేట్ కానున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ చివరి నిమిషంలో సేఫ్ అయ్యారు.అయితే ఈవారం కూడా మాస్టర్ నామినేట్ అయ్యాడు.
ఆయనతో పాటు అభిజిత్, మోనాల్, హారిక, అవినాష్లు కూడా నామినేషన్లో ఉన్నారు.
వీరిలో అభిజిత్, మోనాల్లు నామినేషన్కు వచ్చిన ప్రతి సారి సేఫ్ అవుతూనే ఉంటారు.
బిగ్ బాస్ కావాలనే వీరిని సేవ్ చేస్తున్నారా.లేదా ప్రేక్షకులే వీరిని కాపాడుతున్నారా అన్న విషయాలు పక్కన పెడితే.
వీరిద్దరూ ఈ వారం కూడా బయటకు వెళ్లేలా కనిపించడం లేదు.ఇక హారిక, అవినాష్లు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే.
ఈ క్రమంలోనే అమ్మ రాజశేకర్ మాస్టర్నే ఈ వారం బ్యాగ్ సద్దేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారాలుపై తాజాగా అమ్మ రాజశేఖర్ సతీమణి రాధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ.`మా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిమినేట్ అవ్వరు.
ఆయన లేకపోతే బిగ్ బాస్ షోనే లేదు.అది వాళ్లకి కూడా తెలుసు.
అందుకే ఆయనను ఉంచుతున్నారు.సేవ్ అవుతున్నారు.
` అని క్లారిటీ ఇచ్చింది.అంతేకాదు మాస్టర్ బిగ్ బాస్ టైటిల్ కూడా విన్ అవుతారని.
ఒకవేళ ఆయన కాకపోతే అరియానా లేదా అవినాష్లలో ఒకరు గెలుస్తారని జోష్యం కూడా చెప్పారామే.
అలాగే సోషల్ మీడియాలో మాస్టర్ను ట్రోల్ చేస్తున్న వారికి కూడా రాధ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఆయన మాట్లాడితే వివాదం అంటున్నారు.అది వివాదం కాదు ఆయన క్యారెక్టర్ అని.పైకి ఒకలా లోపల ఒకలా ఉండడం ఆయనకు రాదని ఆమె చెప్పుకొచ్చారు.ఇక ముసలివాడిలా ఓ మూలన కూర్చోకుండా.
ప్రతి టాస్క్లోనూ యాక్టివ్గా ఆడుతున్నారని.మిగిలిన వాళ్లతో పోలిస్తే ఆయన చాలా బెటరని రాధ తెలిపారు.
మరి ఈమె మాటల ప్రకారం. టైటిల్ విషయం పక్కన పెడితే.
అసలు ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.