సికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఒక మైనర్ బాలుడు తప్పిదం కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తుంది.
సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.టాటా ఏస్ వాహనం నడిపేందుకు ఒక మైనర్ బాలుడు ప్రయత్నించడం తో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే….గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వారసి గూడ లో శుభకార్యం జరుగుతుంది.
ఈ క్రమంలోబ్యాండ్ టీమ్ వెళుతుండగా ఆ వెనుకగా వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ ఆన్ లోనే ఉంచి పక్కనే ఉన్న పాన్ షాప్ లోకి వెళ్ళాడు.దీనితో ఒక బాలుడు ఆ బండిన నడపడం కోసం అని వాహనాన్ని రేజ్ చేసాడు.
అయితే వాహనం గేర్ లోనే ఉండడం తో ముందు వెళుతున్న బ్యాండ్ టీమ్ పై దూసుకెళ్లింది.దీనితో ఒక వ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరు బాలురు గాయపడినట్లు సమాచారం.
అయితే ఈ ఘటన తో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.దీనితో కేసు చిలకల గూడ పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.