బీహార్ రాష్ట్రంలో భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.12 మందితో కూడిన బ్యాండ్ బృందం ఆటోలో పూర్నియా నుంచి బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు.సరిగ్గా 31 వ జాతీయ రహదారిపై చేరుకున్నాక కుర్షేలా సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్ అదుపుతప్పి ఢీ కొట్టింది.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ప్రమాదంలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఇదే తరుణంలో తీవ్రంగా గాయాలపాలైన నలుగురికి చికిత్స అందిస్తున్నారు.