రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇక్కడున్న నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ ని పడవేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.
కాగా ఈ ఘటన ప్రదేశంలో చెలరేగుతున్న మంటలు భారీగా ఎగిసి పడుతు ఆకాశాన్నంటుతున్నాయట.ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే సంభవించిన ఘటనగా తెలుస్తుంది.
ఇకపోతే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతం రాయి గ్రామ శివారు లోని నిర్మానుష ప్రాంతంలో ప్రాణాంతక కెమికల్ పార పోసిన గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి వెళ్లిపోయారట.కాగా ఇలాంటి సంఘటన అంతకముందు కూడా ఒకసారీ జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు.
ఇక ఈ కెమికల్ నుండి వచ్చే పొగవల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారట.
.