పాన్ ఇండియా నటుడు యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు.ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్టార్ దర్శకుల వరకు అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు.
ఇక పాన్ ఇండియా సినిమాలకే ఆసక్తి చూపుతున్నాడు ప్రభాస్.ఇక ఈ రెబల్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరో లను మించిపోయింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.గతంలో తెరకెక్కిన ఉగ్రం సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నా సినిమా ఇది.కానీ ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ తెలుపుతున్నాడు.ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కనుంది.
ఇక ఇందులో కన్నడ నటుడు మధు గురుస్వామి విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా మొత్తం ఆ ఒక్క ఫైట్ తోనే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమాలో మొత్తం యాక్షన్ సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఉండగా.ఇందులో లో ప్రతి ఒక్క సన్నివేశానికి ఫైట్ క్లైమాక్స్ అన్నట్టుగా ఉంటుందట.ఈ సినిమాలో 300 మందితో ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేశారట.ఇందులో ప్రభాస్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా 300మంది మరో వైపు ఉంటారట.ఇక ఈ సీన్ ను బట్టి ఈ సినిమా ఎంత హిట్టును సాధిస్తుందో అర్థమవుతుంది.ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 30 న విడుదల చేయనున్నారు.