ఆఫ్ఘనిస్తాన్ దేశం కాబూల్ విమానాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది.సరిగ్గా విమానాశ్రయం ప్రవేశద్వారం వద్ద బాంబు పేలడంతో భారీ శబ్దం వాటిల్లింది.
అయితే పేలుడు ఘటనలో ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగలేదు.అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిన కొద్ది గంటల వ్యవధిలోనే బాంబులు పేలడం అంతర్జాతీయస్థాయిలో కలకలం రేపింది.
పశ్చిమ దేశాలు విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నాయి.ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా భారన్ హోటల్ సమీపంలో.కాబూల్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద.బాంబు పేలడం జరిగింది.
అయితే పేలుడు ఘటనలో ఏ దేశానికి చెందిన సైనికులు చనిపోలేదని బ్రిటిష్ వర్గాలు తెలియజేశాయి.ఈ పరిణామంతో పశ్చిమ దేశాలు.
కాబోలు విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల తరలింపు ప్రక్రియను ఆపేసాయి.