జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..!!

ఈరోజు తెల్లవారుజామున జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో షోపియాన్‌ జిల్లాలో భారత ఆర్మీకి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్లు నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.ఉగ్రవాదులు లష్కరే సంస్థకు చెందిన వాళ్లు.

 Massive Encounter In Jammu Crpf, Jammu And Kashmir, Lashkare Thoibaa,terrorists,-TeluguStop.com

షోపియాన్‌ జిల్లాలో మనీ హాల్ అనే ప్రాంతం వద్ద ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి.సామాన్య ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదులు తలదాచుకున్న స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు సహాయం కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు తీసుకోవటంతో వెంటనే భద్రత దళాలు ఉగ్రవాదుల దాగి ఉన్న స్థలం లోకి చొచ్చుకుని వెళ్లి వెంటనే కాల్పులు జరపడంతో లష్కరే తోయిబా కి చెందిన నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు.జరిగిన ఈ ఆపరేషన్లో మొదట భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో దీటుగా జవాబు ఇచ్చారు మన దేశానికి చెందిన జవాన్లు.

దెబ్బకి మొత్తం ముగ్గురు వాదులంతా ఫినిష్ అయ్యేలా కాల్చి చంపారు.ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదుల కదలికలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ గా ఉంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube