ప్రపంచంలోనే ఎక్కువ అందమైన ప్రదేశాలు కలిగిన దేశం న్యూజిలాండ్.అలాంటి అందమైన దేశంలో కొన్ని క్షణాల క్రితం వరుస భూకంపాలు సంభవించటంతో న్యూజిలాండ్ వాసులు వణికిపోతున్నారు.రిక్టర్ స్కేలుపై 7.3, 7.4, 8.1 గా నమోదు కాగా, ఇదే తరుణంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో.ఆ దేశ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.టోకోమారు బేలో సముద్రంలో సముద్రం ముందుకు వచ్చింది.
చిన్న చిన్న అలలు ఎగసిపడుతున్నాయి.తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసి ఖాళీ చేయించేస్తున్నారు.
బీచ్ లు అదేవిధంగా పోర్ట్ లు తాత్కాలికంగా మూసేశారు.ప్రజలను ఎవరిని రానీయడం లేదు.
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది న్యూజిలాండ్ ప్రభుత్వం.
.