ఓ దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది.దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలకే కాకుండా ఏకంగా 240 కిలో మీటర్ల మేర వినిపించింది.
ఆ శబ్దాన్ని విన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.గోడౌన్ లో పని చేస్తున్న కార్మికులు వందల్లో చనిపోయారు.
గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పేలిన పేలుడికి పొగ మంచు కమ్మెసింది.అప్రమత్తమైన ఆ దేశ ప్రభుత్వం క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమైంది.
లెబనాల్ దేశ రాజధాని బీరుట్ లో ఈ ఘోర విషాదం చోట చేసుకుంది.బీరుట్ లోని ఓ పోర్టులోని గోడౌన్ ఉంది.గోడౌన్ మూసివేయడంతో గత ఆరేళ్లుగా ఆ గోడౌన్ లో పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయి.నిల్వ ఉన్న పేలుడు పదార్థాలు పీడనానికి గురై భారీ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఘటనలో చాలా మంది తమ కుటుంబాలు కోల్పోయారు.చుట్టు పక్కల ఉన్న భవనాలు కూలిపోయాయి.
దీంతో లెబనాల్ దేశ అధ్యక్షుడు మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించాడు.ఈ పేలుడులో 70 మంది నుంచి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు.
నాలుగు వేలకు పైగా మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.