గత కొన్ని రోజుల వరకు ప్రశాంతంగా ఉన్న అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది.దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్లోని రోచెస్టర్లో శుక్రవారం అర్థరాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలసమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 12 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.రోచెస్టర్లోని గుడ్మాన్ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
తమపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా నల్లజాతీయులు గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి వరకు రోచెస్టర్లో నిరసనలు కొనసాగాయి.వీరిని లక్ష్యంగా చేసుకునే దుండగుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.