రాజమండ్రిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

ఏపీలో కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది.

 Girl, Rajamandri, Gang Rape-TeluguStop.com

మైనర్ బాలికను బంధించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి.నాలుగు రోజుల పాటు నరకం చూపించి నడివీధిలో వదిలేసి పరారయ్యాయి.

ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలికను బలవంతంగా తీసుకెళ్లి గదిలో బంధించి కామాంధులు దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు.

పశువుల్లా మీద పడి కామకోరికలు తీర్చుకున్నారు. నాలుగు రోజులు నరకం చూపించారు.

ఆమెను చిత్రహింసలకు గురిచేసిన కామాంధులు కారులో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం.

అయితే బాలిక కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఐదు రోజుల కిందట కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిందితులు బాలికని ఏకంగా పోలీస్ స్టేషన్ వద్దకే తెచ్చి విడిచిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది.పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బూసిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రధానోపాధ్యాయురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.నిందితులపై ఫోక్స్ , దిశా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకొచ్చిన అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది.ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల ఆగడాలకు మహిళలు బలి అవుతూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube