కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది.మాస్కు ఉపయోగించడం వల్ల కరోనా వ్యాప్తి తక్కువ అవుతుంది.
దీంతో ప్రజలంతా కూడా మాస్కు వినియోగిస్తూ కరోనా నుంచి వారిని వారు కాపాడుకుంటున్నారు.కొందరు మాత్రం కనీసం బాధ్యత లేకుండా మాస్కు ధరించడం లేదు.
ప్రభుత్వం ఎన్ని సార్లు హెచ్చరించిన.బ్రతిమిలాడిన కొందరు ప్రజలు అసలు వినడం లేదు.దీంతో యూకే ప్రభుత్వం చిన్న జరిమానా వెయ్యడం ప్రారంభించింది.మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే ఏకంగా వంద పౌండ్లు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది.
జరిమానా విధించిన మొత్తాన్ని 14 రోజుల్లోగా చెల్లించాలని తెలిపింది.
దీంతో ప్రజలంతా కూడా జరిమానా కట్టడానికే సిద్ధం అయ్యారు.
ఇది చుసిన ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వంద పౌండ్ల నుంచి మూడువేల పౌండ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.14 లక్షలు.ఇక ఏదైనా వేడుకల్లో 30 మందికి మించి ఎక్కువ మంది ఉంటే నిర్వాహకులకు 10 వేల పౌండ్లు జరిమానా ప్రభుత్వం తెలిపింది.