గోపీ చంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా మారుతి ప్రకటించాడు.
కాని కొన్ని కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది.షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే అక్టోబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.
మారుతి ప్లాన్ బెడిసి కొట్టింది.సెకండ్ వేవ్ తో మారుతి తదుపరి సినిమా పక్కా కమర్షియల్ సినిమా ఆగిపోయింది.
ఎప్పటికి మళ్లీ మొదలు అయ్యేది క్లారిటీ లేదు.పక్కా కమర్షియల్ మూవీ మొదలు ఎప్పుడో కాని అంతకు ముందు మారుతి ఒక సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో మారుతి సినిమా కు రంగం సిద్దం అయ్యింది.కేవలం మూడు నెలల్లోనే ఆ సినిమా ను ముగించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా ను లో బడ్జెట్ తో నిర్మించబోతుంది.
అయిదు కోట్ల బడ్జెట్ తో కేవలం మూడు నెలల్లోనే సినిమా ను ముగించిన తర్వాత మారుతి తన గోపీచంద్ మూవీ పక్కా కమర్షియల్ ను మొదలు పెట్టబోతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న పక్కా కమర్షియల్ కంటే ముందు సంతోష్ శోభన్ తో మారుతి చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వర్షం సినిమా తో తనకు మంచి కమర్షియల్ హిట్ ను అందించిన శోభన్ తనయుడు అవ్వడం వల్ల సంతోష్ కు ప్రభాస్ మొదటి నుండి మద్దతుగా నిలుస్తున్నాడు.
ఇటీవల వచ్చిన ఏక్ మినీ కథ కూడా ప్రభాస్ మద్దతు తో బయటకు వచ్చింది.ఆ సినిమా కు మంచి టాక్ వచ్చింది.పర్వాలేదు అన్నట్లుగా టాక్ రావడంతో పాటు సినిమా ఆకట్టుకుంది అంటూ రివ్యూలు వచ్చాయి.దాంతో సంతోష్ శోభన్ వెంటనే మరో సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అంటూ వార్తలు వచ్చిన కొన్ని రోజుల గ్యాప్ లోనే మారుతి దర్శకత్వంలో ఈ యంగ్ హీరో సినిమా చేయబోతున్నట్లుగా కొత్త ప్రచారం మొదలు అయ్యింది.