ప్రతి రోజు పండుగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు మారుతి తదుపరి సినిమా మొదలు పెట్టాలనుకున్న సమయంకు కరోనా వచ్చింది.దాంతో ఏడాదికి పైగా ఆయన ఖాళీగానే ఉన్నాడు.
ఆ తర్వాత గోపీచంద్ తో పక్కా కమర్షియల్ మూవీని పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటించి అక్టోబర్ లో సినిమాను విడుదల చేస్తానంటూ కూడా ప్రకటన చేశాడు.కాని కరోనా కారణంగా సినిమా ను పట్టాలెక్కించలేక పోయారు.
సెకండ్ వేవ్ తో గోపీచంద్ మూవీ పట్టాలెక్కలేదు.ఒక వైపు పక్కా కమర్షియల్ మూవీ గురించి చూస్తున్న సమయంలో అనూహ్యంగా మారుతి నుండి మంచి రోజులు వచ్చాయి అనే సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది.
సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన ఆ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో షూటింగ్ ఇప్పుడే మొదలు అయ్యిందేమో అంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమా షూటింగ్ ను ముగించేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.ఈ సినిమాను దర్శకుడు మారుతి కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.అంత స్పీడ్ గా ఎలా చేశారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.మారుతి సినిమాలను స్పీడ్ గానే తెరకెక్కిస్తాడు.కాని మొదలు పెట్టడం ఆలస్యంగా మొదలు పెడతాడు.ఒక సారి మొదలు అయ్యింది అంటే వెంట వెంటనే షెడ్యూల్స్ ప్లాన్ చేసి పూర్తి చేస్తాడు.
గత చిత్రాలు స్పీడ్ గానే పూర్తి చేసిన మారుతి ఈ సినిమాను అంతకు మించి అన్నట్లుగా ముగించాడు.కేవలం 30 వర్కింగ్ డేస్ లోనే ఈ సినిమాను ముగించాడట.
ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించారు.మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ప్రేమ ను కొత్తగా చూపించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందంటూ మారుతి సన్నిహితులు అంటున్నారు.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించారు.