టాలీవుడ్
లో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న
మారుతి
.కమర్షియల్ కంటెంట్ తో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో మారుతి తన మార్క్ చూపిస్తున్నాడు.
వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న మారుతి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఇప్పుడు
కుర్ర హీరోలు
అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.ఏదో ఒక సమస్యని హీరోకి పెట్టి దాని చుట్టూ కామెడీని పండిస్తూ సినిమాలు చేసి హిట్స్ కొట్టిన మారుతి ఈ సారి మంచి కమర్షియల్ కథతో మాస్ ఎంటర్టైనర్ తీయాలని భావిస్తున్నాడు.
దానికి ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకొని రామ్ కి చెప్పి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం
కిషోర్ తిరుమల
దర్శకత్వంలో
రెడ్
సినిమాని షూటింగ్ ని
రామ్
పూర్తి చేశాడు.
ఇక రామ్ కెరియర్ లో మొదటి సారి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు.ఇక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.
ఇప్పటికే
ఇస్మార్ట్ శంకర్
తో మంచి జోష్ మీద ఉన్న రామ్ రెడ్ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకునేట్లు ఉన్నాడు.ఇక ఈ సినిమా తర్వాత మారుతి సినిమాని పట్టాలు ఎక్కడించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని
మైత్రీ మూవీ మేకర్స్
వారు నిర్మించబోతున్నట్లు సమాచారం.