పెళ్ళయిన ఆరు నెలలకే ఓ వివాహిత హైదరాబాద్ లో వనస్థలిపురంలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంది.హైదరాబాద్ లో ఉంటున్ రఘుప్రసాద్, నివేదిత అనే అమ్మాయితో ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది.
అయితే వివాహం అయిన కొద్ది రోజుల నుంచి ఆమెకి భర్త వేదింపులు మొదలైనట్లు తెలుస్తుంది.అయితే భర్త వేదింపుల గురించి తల్లిదండ్రులకి చెప్పిన పరిష్కారం దొరకకపోవడంతో ఆమె తీవ్ర మనోవ్యధకి గురయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో నిన్న రాత్రి మళ్ళీ భర్తతో నివేదితకి గొడవ జరిగిందని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నివేదిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.