ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక బంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం అంతమొందించడానికి వెనుకాడడం లేదు.తాజాగా ఓ వివాహం అయిన మహిళ యువకుడి మోజులో పడి కట్టుకున్న భర్తని సైతం దారుణంగా హత్య చేయించి చివరికి హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఘటన పాండిచ్చేరి పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో భువనేశ్వరి అనే వివాహిత తన భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది.అయితే వివాహిత భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో భువనేశ్వరికి స్థానికంగా ఉన్నటువంటి 23 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడితో పరిచయం ఏర్పడి. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ క్రమంలో భువనేశ్వరి ఇంట్లో తన భర్త లేని సమయంలో యువకుడిని కలుసుకుంటూ ఉండేది.కాగా యువకుడితో శాశ్వతంగా ఉండిపోవాలని భువనేశ్వరి ఏకంగా తన భర్తని హత్య చేయాలని పన్నాగం పన్నింది.
ఇందులో భాగంగా తన ప్రియుడి సహాయం కూడా తీసుకొని కారుతో భర్తని ఢీ కొట్టించి హత్య చేయించింది.అనంతరం ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పించుకోవాలని చూసింది.అయితే భువనేశ్వరి ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి ఆమె భర్త తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే భువనేశ్వరి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తని తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు అంగీకరించింది.