ఈ మధ్యకాలంలో కొందరు కామందకారంలో మునిగిపోయి వావి వరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.తాజాగా కొత్తగా పెళ్లయి ఇంటికి వచ్చిన కోడల్ని కన్న తండ్రిలా చూసుకోవాల్సిన మామ చివరికి కామాంధుడుగా మారి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడ పరిసర ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.ఈమెకి రెండేళ్ల క్రితం హోమియోపతి వైద్యుడు గా పని చేస్తున్న ఓ వ్యక్తితో వివాహం అయ్యింది.
తమ కూతుర్ని బాగా చూసుకుంటాడని యువతి తల్లిదండ్రులు తమ అల్లుడికి దాదాపుగా 40 లక్షల రూపాయలకు పైగా కట్న, కానుకలు కూడా ముట్ట చెప్పారు.కానీ యువతి భర్త మాత్రం శోభనం రోజునే మొహం చాటేశాడు.
దీంతో ఈ విషయం గురించి తన అత్తమామలకు యువతి చెప్పడంతో పెళ్లయిన కొత్తలో ఇలాంటివి సహజమని కప్పి పుచ్చారు.
అయితే రానురాను యువతి అత్తమామల ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి.
అలాగే ఈ మధ్య తన భర్త కూడా తనని పట్టించుకోవడం మానేశాడు.దీంతో యువతి మరోమారు ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా తన మామ బలవంతంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని యువతిని ఇంట్లోనే బంధించారు.
ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రులకి తన అత్తమామలు మరియు భర్త నిజస్వరూపం గురించి తెలియజేసింది.
అంతేగాక తాను గత కొద్ది రోజులుగా ఆహారం మరియు నీరు లేకుండా గడుపుతున్నానని తాను చనిపోయే స్థితిలో ఉన్నట్లు తెలిపింది. దీంతో వెంటనే యువతి తండ్రి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి కి సమాచారం అందించి తన కూతురిని ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్య చికిత్స అనంతరం యువతి తెలిపిన వివరాల మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.