ప్రస్తుత కాలంలో కొందరు అక్రమ సంబంధాల మోజులో పడి తమ కాపురాలని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తమై డబ్బులు సంపాదించేందుకు గాను దుబాయ్ కి వెళ్లగా అతడి భార్య తన కామ కోరికలను అదుపు చేసుకోలేక స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని తన పచ్చని కాపురం కూల్చివేసుకున్న ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే రాజు (పేరు మార్చాం) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్ పట్టణ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే రాజు ఓ స్నేహితుడి సలహా ద్వారా దుబాయ్ లో ఉద్యోగం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
దీంతో కుటుంబ సభ్యులలో ఇక్కడే వదిలి పెట్టి ఒక్కడే దుబాయ్ కి వెళ్ళాడు.ఉద్యోగం నిమిత్తమై భర్త దూరం కావడంతో అతడి భార్య వసుంధర తన కామ కోరికలను అదుపు చేసుకోలేక పోయింది.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కామ కోరికలు తీర్చుకునేది.
ఈ క్రమంలో ఎక్కడ తమ విషయం తన కడుపు పుట్టిన కొడుకుకి తెలిసి పోతుందేమోనని అభం శుభం తెలియని చిన్నారికి నిద్ర మాత్రలు మింగించి బాబు నిద్రలోకి జారుకున్న తర్వాత రాత్రి పూట వీరిద్దరూ రాసలీలలు సాగించేవారు. దీంతో రాజు స్వదేశానికి వచ్చిన సమయంలో చుట్టుపక్కల తెలిపిన సమాచారంతో తన భార్య గుట్టు రట్టు ను చేశాడు.అనంతరం పోలీసులకు సమాచారం అందించి తన భార్యపై ఫిర్యాదు చేశాడు.
అలాగే తనని మోసం చేసినటువంటి వసుంధర తో ఇక తాను కలిసి జీవించేది లేదంటూ కోర్టులో విడాకుల అప్లై చేసాడు.