ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో కూరుకుపోయి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.తాజాగా ఓ భార్య తనతో శృంగారం చేయాలంటూ తన భర్తపై తెచ్చిన ఒత్తిడి తాళలేక ఆ భర్త ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయిన ఘటన అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నగరానికి చెందినటువంటి ఓ యువతికి అదే నగరానికి చెందిన అటువంటి మరో యువకుడితో 4 సంవత్సరాల క్రితం వివాహం అయింది.పెళ్ళైన మొదట్లో వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు.
వీరికి రెండేళ్ల క్రితం బిడ్డ కూడా పుట్టింది.అయితే బిడ్డ పుట్టిన అనంతరం అతడు ఆమెతో శృంగారం చేయడానికి ఆసక్తి కనబరచలేదు.
అయితే అప్పటికే కామవాంఛలతో రగిలిపోతున్న అటువంటి ఆ మహిళ తరుచూ శృంగారం చేయాలంటూ తన భర్తపై ఒత్తిడి తెచ్చింది.దీంతో ఆమె వేధింపులు తాళలేక అతడు ఇల్లు వదలి పెట్టి వెళ్ళిపోయాడు.
అయితే విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు తమ కొడుకు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోవడానికి తమ కోడలు కారణమని భావించి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు.దీంతో వారు చేస్తున్నటువంటి చిత్రహింసలు తాళలేక ఆమె దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించింది.ఇందులో భాగంగా తన భర్త తనని వైవాహికంగా తృప్తి పరచ లేదని అందువలన అతడిని నిలదీశిన మాట వాస్తవమేనని, కానీ అతడు దాన్ని సాకుగా పెట్టుకొని చేసిన అప్పులు తీర్చలేక తనని తన బిడ్డని వదిలి పెట్టి వెళ్ళిపోయాడని ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో తన అత్తమామలు రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ పోలీసులను కోరుతోంది.