ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని మోసం చేయడం, మరియు అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని మర్చిపోలేక ప్రాణాలను సైతం వదిలేయడానికి సిద్దపడుతున్నారు.కాగా తాజాగా 38 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి తనకంటే 14 సంవత్సరాలు చిన్నదైన వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి ఈ విషయం తన ఇంట్లో వాళ్లకి తెలిసి మందలించడంతో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కరూర్ జిల్లా పరిసర ప్రాంతంలో శివ భాగ్యం అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా శివ భాగ్యం భర్త కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
అలాగే శివ భాగ్యం కూడా అప్పుడప్పుడు స్థానికంగా దొరికేటటువంటి పొలం పనులకు వెళుతూ ఉండేది.ఈ క్రమంలో ఓ ఎస్టేట్ లో పని చేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
దీంతో ఈ పరిచయం కాస్తా అతికొద్ది సమయంలోనే వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ క్రమంలో వీరిద్దరూ పొలంలో ఉన్నటువంటి “పంపు సెట్ హౌస్ లో అప్పుడప్పుడు ఏకాంతంగా కలుసుకునేవారు”.
దీంతో తాజాగా ఇతరుల ద్వారా వీరిరువురి కుటుంబ సభ్యులకు ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసింది.దీంతో వీరిద్దరిని మరోమారు ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని ఇరువురి కుటుంబ సభ్యులు హెచ్చరించి మందలించారు.
దీంతో అప్పటికే పీకల్లోతు కామాందకారంలో మునిగి పోయిన ఇద్దరు ఏకంగా ఒకరినొకరు విడిచి ఉండలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఇందులో వివాహితురాలు అక్కడికక్కడే మృతి చెందగా ప్రియుడు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
దీంతో తన ప్రియురాలి చావుకి తానే కారణమని తనలో తానే పశ్చాత్తాపపడి ఏకంగా దగ్గరలో ఉన్నటువంటి చెట్టుకు ఉరివేసుకొని మళ్లీ ఆత్మహత్య చేసుకున్నాడు.