భార్య భర్తల మధ్య గొడవలు సహజం.కారణం లేకుండానే కొందరు గొడవ పడుతూ ఉంటారు.
అయితే ఒక్కోసారి ఆ సమయంలో క్షణికావేశానికి గురైతే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో అన్న విషయం మాత్రం చెప్పలేము.సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే….మాదాపూర్ లోని ఆదిత్య బిర్లా కంపెనీ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఎన్.ప్రవల్లిక(30), 2014 లో ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన ఎన్.వెంకటరమణ(38) ను ప్రేమ వివాహం చేసుకుంది.వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది.అయితే కుమార్తె రిత్విక పుట్టు వెంట్రుకల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడం తో ఆవేదనకు గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
రిత్విక పుట్టు వెంట్రుకల కోసం అని మొదట వెంకటరమణ తల్లి దండ్రులతో పాటు అతడి కుటుంబ సభ్యులు అందరికి కూడా రైలు టికెట్లు బుక్ చేయగా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రయాణం రద్దు చేయడం తో ప్రవల్లిక విమానంలో తిరుపతికి రిత్విక ని తీసుకొని ఇద్దరూ వెళ్లి వచ్చేద్దాం అని చెప్పడం తో దానికి వెంటకరమణ నిరాకరించాడు.
దీనితో ప్రవల్లిక,వెంటకరమణ ఇద్దరి మధ్య కొంచం వాదనలు జరిగాయి.
భర్త తనకంటే తల్లి దండ్రుల మాటకే ఎక్కువగా విలువ ఇస్తున్నాడు అని ఆవేదన చెందిన ప్రవల్లిక ఇలా తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.