ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి.అంతేగాక తమ అనుకున్న వారి జీవితాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్న సంఘటనలు కోకొల్లలు.
తాజాగా ఓ మహిళ తన వరుసకు మేనల్లుడు అయినటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం తన భర్తకు తెలియడంతో తాను మరియు తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన వనపర్తి జిల్లాలో ని భగత్ సింగ్ తండాలో దేవమ్మ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.
అయితే ఈ క్రమంలో దేవమ్మకు వరుసకు మేనల్లుడు అయ్యే ఓ యువకుడు తరచూ ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.దీంతో దేవమ్మ ఆ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.
దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్నప్పుడు దేవమ్మ భర్త రాజు వీరిద్దరిని చూశాడు.దీంతో తీవ్ర భయాందోళనలకు గురయినటువంటి దేవమ్మ మరియు ఆమె ప్రియుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం పొలంలో పిచికారీ చేసేటువంటి పురుగుల మందులు కొనుక్కొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సేవించారు.ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు బాధితులను వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
సమాచారం అందుకున్న టువంటి పోలీసులు బాధితుల కుటుంబాలకు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.