మూడుముళ్ల భందానికి.భారతీయ సాంప్రదాయ వ్యవస్థకి ఈ కాలంలో విలువలు తగ్గిపోతున్నాయి అనడడానికి ఈ సంఘటనే నిరద్సరం కేవలం ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తికోసం కట్టుకున్న భర్త మరణానికే పక్కా ప్లాన్ వేసిన ఈ భార్య చివరకి అనుకున్నది సాధించింది.
తన భర్తని ఫేస్ బుక్ ప్రియుడితో హత్య చేయించింది.ఈ షాకింగ్ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తితో సరస్వతి ప్రేమలో పడింది.అయితే ఈ ప్రేమ తన భర్తతో పెళ్లి కాకముందే జరిగింది.అయితే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన మేనమామని అడ్డు తొలగించుకుని తన ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంది.అందుకు పక్కా ప్లాన్ కూడా రచించింది.
అందుకోసం దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎనిమిది వేల నగదును, పెళ్లి ఉంగరాన్ని అడ్వాన్స్గా ఇచ్చింది.
ప్లాన్ ప్రకారం తోటపల్లి ప్రాజెక్టు వద్దకు రాగానే మూత్రవిసర్జన సాకుతో భర్తను ద్విచక్ర వాహనాన్ని ఆపాల్సిందిగా కోరింది…అయితే బండి ఆపగానే సరస్వతి భర్త శంకర్రావుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి అతని తలపై బలంగా కొట్టి హత్య చేశారు.అయితే ఎవరో దుదగులు తన భర్తని హత్య చేశారు అని నమ్మించే ప్రయత్నం చేసినా సరే పోలీసుల ముందు తన పాచిక పారలేదు.దాంతో
ఈ హత్య సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో, హతురాలి భార్య చెప్తున్న పొంతన లేని మాటలతో ఎస్పీకి మరింత అనుమానం రావడంతో ఆదిసగా ఆధారాలు సేకరించి విచారణ చేశారు.విచారణలో తన భర్తని ఆమె చంపడానికి ప్లాన్ చేసిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.