ప్రస్తుత కాలంలో కొన్ని పరిచయాలు మంచి బంధాలు నిలబెడితే మరి కొన్ని పరిచయాలు వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని పలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
తాజాగా టిక్ టాక్ లో పరిచయమైన ఓ యువతి తన స్నేహితురాలిని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుండగా అది తట్టుకోలేక మరో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని స్థానిక విల్లుపురం అనే గ్రామంలో కడల్ కన్ని అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది.
అయితే ఈమెకు భర్త చనిపోవడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.అయితే తాజాగా ఈమెకు సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి టిక్ టాక్ ద్వారా ఓ స్నేహితురాలు పరిచయమైంది.
దీంతో అప్పుడప్పుడూ వీళ్ళిద్దరూ కలిసి టిక్ టాక్ వీడియో లో నటిస్తూ కొంతమేర సన్నిహితంగా ఉండే వాళ్ళు.అయితే ఈ క్రమంలో టిక్ టాక్ లో పరిచయమైనటువంటి యువతి వ్యభిచారం చేయాలంటూ కడల్ కన్నిపై ఒత్తిడి తెచ్చింది.
అంతేగాక తన నివాసం ఉంటున్నటువంటి చిరునామా వివరాలు కనుక్కొని ఏకంగా తన ఇంటికి ఇద్దరు మనుషులను పంపి రెండు లక్షల రూపాయలు డబ్బు కూడా డిమాండ్ చేసింది.ఒకవేళ తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి వాళ్లు అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
దీంతో ఏం చేయాలో తోచని ఆ మహిళ తనలో తానే మదన పడుతూ ఉండేది.అయితే ఈ క్రమంలో రానురాను తనపై వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి ఎక్కువవడంతో తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ విషయాన్ని గమనించినటువంటి యువతి కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.