నేరగాళ్లు చేసే పాపాలు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి.చాలామంది అమాయక అమ్మాయిలను కొందరు క్రూరులు ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ వ్యభిచార కూపంలోకి నెడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఓ నీచాతి నీచుడి గురించి తెలిస్తే షాక్ అయిపోతారు.అతగాడు ఎంతమందిని మోసం చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాడో తెలిస్తే గుండెలు కరిగిపోతాయి.
ముందు అతన్ని ఒక సాధారణ నేరస్తుడనే అనుమానంతనే పోలీసులు అరెస్టు చేశారు.కానీ అతగాడు చెప్పి విషయాలను విని అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది.ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక సెక్స్ రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు ఇందులో నుంచి దాదాపుగా 21 మంది అమ్మాయిలను కాపాడారు.
కాగా వీరందరినీ ఈ కూపంలో నెట్టిన మునిర్ అనే నేరస్తుడిని గుజరాత్ లో అదుపుతోకి తీసుకుని విచారంచగా విస్తుపోయే విషయాలు తెలిసాయి.మునిర్ అనే నిందితుడు బంగ్లాదేశ్ దేశంలోని జాసుర్ ఏరియాలో నివసించేవాడని తెలుస్తోంది.
కాగా అక్కడి అమ్మాయిలను, మహిళలను ఉపాధి చూపిస్తానంటూ మోసం చేసి భారత్ లోకి అక్రమంగా తరలించేవాడంట.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ పట్టణం మీదుగా ఈ అక్రమ రవాణా సాగేదని గుర్తించారు పోలీసులు.ఇలా బంగ్లాదేశ్ యువతులను ముంబయితో పాటుగా కోల్ కతా లాంటి పట్టణాలకు చెందిన వ్యభిచార ముఠాలకు అమ్మేస్తాడు.ఇప్పటి దాకా ఇతగాడు 75 మందిని పెళ్లి పేరుతో మోసం బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాడని తెలుస్తోంది.
వీరితో పాటు మరికొందరిని మొత్తంగా కలిపి 200మంది అమ్మాయిలను ఇలా వ్యభిచార కూపంలోకి నెట్టేశాడని తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న వారంతా విస్తుపోతున్నారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినదిస్తున్నారు.
.