ఈ మధ్య కొందరు తమ కామ వాంఛను తీర్చుకునేందుకు ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి మూడో పెళ్లి చేసుకోబోయే యువతికి తెలియకుండా జాగ్రత్త పడి గుట్టుగా పెళ్లి చేసుకుని సంసారం చేసిన తర్వాత ఆమె గర్భం దాల్చడంతో ఎలాగైనా అబార్షన్ చేయించాలని ఆమెను చిత్రహింసలకు గురి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరానికి చెందిన సంధ్య (పేరు మార్చాం) అనే యువతి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో నివాసముంటోంది.దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
ఈ క్రమంలో తనతో పాటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ప్రేమించింది.దీంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది.
అయితే తమ కూతురిని ఇష్టాన్ని అంగీకరించిన పెద్దలు వీరిద్దరిని పెద్ద మనసుతో ఆశీర్వదించారు.ఇక్కడి వరకూ అంత బాగానే ఉంది.
కాగా ఇటీవలే సంధ్య గర్భం దాల్చింది.దీంతో తన భర్త తనకి ఇప్పుడప్పుడే పిల్లలు కనడం ఇష్టం లేదని అబార్షన్ చేయించుకోవాలని ఆమె పై ఒత్తిడి చేయసాగాడు.
అంతేగాక పలుమార్లు చిత్ర హింసలు కూడా పెట్టాడు.అయినప్పటికీ సంధ్య మాత్రం అబార్షన్ చేయించుకోవడానికి ఇష్ట పడలేదు.దీంతో సంధ్య భర్త ఏకంగా భార్యా భర్తలిద్దరూ ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన వీడియోలను చూపిస్తూ అబార్షన్ చేయించుకోకపోతే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించ సాగాడు.
దీంతో సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన భర్త చేస్తున్న ఆగడాలు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా పలు విషయాలను కనుగొన్నారు.ఇందులో భాగంగా సంధ్య భర్తకి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని అందువల్లనే సంధ్య పిల్లలకి జన్మనిస్తే ఇబ్బంది అవుతుందని ఆమెను అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించాడట.