ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వివాహమైన ఓ వ్యక్తి తన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా తన భార్యకి దొరికిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాలోకి వెళితే స్థానిక జిల్లాలోని కొత్తగూడెంలో రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ సంస్థలో కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.
దీంతో ఇటీవలే రాజు కేబుల్ కనెక్షన్ పని నిమిత్తమై వెళ్లి ఓ యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు.అయితే ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన రాజు భార్య పలుమార్లు ఈ విషయంపై అతడిని నిలదీసింది.అంతేగాక వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేస్తాయని కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.
అయినప్పటికీ రాజు తన భార్య మాటలను పెడచెవిన పెట్టాడు.
దీంతో మరోమారు రాజు తన ప్రియురాలిని ఏకాంతగా కలుసుకోవడానికి తన ఇంటికి వెళ్లాడు.
ఇది గమనించిన రాజు భార్య అతనికి తెలియకుండా వెంబడించి ఇద్దరిని మంచంపై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.అంతేగాక తన బంధువులకి సమాచారం అందించి ఇద్దరికీ బడిత పూజ చేసింది.
దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురు తెలిపిన వివరాలు మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.