ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ మైకంలో మునిగిపోయి కట్టుకున్న భార్యను సైతం వదిలేయడానికి వెనకాడడం లేదు. తాజాగా ఓ ప్రబుద్ధుడు మొగుడిని వదిలేసి వచ్చి ఇంటి వద్ద ఉంటున్న అత్త కూతురి మోజులో పడి చివరికి తన భార్యను కూడా వదిలిపెట్టి 63 లక్షల రూపాయలతో తన అత్త కూతురుతో కలిసి చెక్కేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మైసూరు పరిసర ప్రాంతంలో యోగేష్ అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై ఓ బ్యాంకు ఏజెన్సీలో ఏటీఎంలలో డబ్బులు నింపే వృత్తి చేస్తున్నాడు.
కాగా ఈ మధ్య కాలంలో యోగేష్ పెళ్లయి తన భర్తతో మనస్పర్థలు, విభేదాలు వచ్చి ఇంటి వద్దే ఉంటున్న తన అత్త కూతురితో కొంతమేర చనువుగా ఉంటున్నాడు.ఈ మధ్య ఈ చనువు కాస్త ప్రేమగా మారింది.
అయితే తాజాగా యోగేష్ యదావిధిగా ఏటీఎంలలో డబ్బులు నింపేందుకుగానూ క్యాష్ వ్యాన్లో సంబంధిత అధికారులతో కలసి బయలు దేరాడు.ఈ క్రమంలో యోగేష్ కి వచ్చినటువంటి దురాలోచన మొత్తం జీవితాన్ని కటకటాల్లోకి నెట్టేసింది.ఇంతకీ ఆ దురాలోచన ఏమిటంటే ఏటీఎంలలో నింపాల్సిన నగదును తీసుకొని తన అత్త కూతురుతో జంప్ అవ్వాలని ఆలోచన తట్టింది.దీంతో అనుకున్నదే తడవుగా తనవెంట వచ్చినటువంటి అధికారులను మస్కా కొట్టించి క్యాష్ వ్యాన్ తో సహా పరారయ్యాడు.
అనంతరం ఇంటి వద్ద ఉంటున్న తన అత్త కూతురుని కూడా డబ్బుతో వస్తున్నానని కాబట్టి రెడీ గా ఉండాలని ఆమెను కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు.
ఈ క్రమంలో తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
దీంతో తనని ఎవరూ గుర్తించలేరని యోగేష్ అపోహ పడ్డాడు.అనంతరం బెంగుళూరులో 7 రోజుల పాటు తన అత్త కూతురుతో బాగా ఎంజాయ్ చేశాడు.
ఆ తర్వాత పోలీసులు కష్టపడి యోగేష్ ని మరియు అతడి ప్రియురాలిని పట్టుకో గలిగారు. కానీ రెండు రోజులలోపే దాదాపుగా 30 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టేశాడు.
దీంతో యోగేష్ పై పోలీసులు పలు చట్టాల కింద కేసు నమోదు చేసి నొక్కేసిన సొమ్మును రికవరీ చేసేందుకు యత్నం చేస్తున్నారు.యోగేష్ జైలు పాలు కావడంతో అతడి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు.
ఇక యోగేష్ తో పాటు యోగేష్ అత్త కూతురు కూడా కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది.