భార్య భర్తలు ఇద్దరు ఒకేలా చదవడం, ఒకే జాబ్ కి పోటీ పడటం చాలా అరుదుగా జరుగుతుంది.ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధం అయిన వేర్వేరుగా చదువుతూ ఉంటారు.
ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జంట పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకొని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.ఇక ఈ పోటీ పరీక్షలలో ఊహించని విధంగా భర్త మొదటి ర్యాంకు తెచ్చుకుంటే భార్య రెండో ర్యాంకు సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన అనుభవ్ సింగ్ ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎంపికవడమే లక్ష్యంగా చదివాడు.
ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం అవడం మొదలుపెట్టారు.ఇక పెళ్లి తర్వాత భార్య విభా సింగ్తో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.ఇటీవల చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ కు పరీక్ష నిర్వహించగా వీరు ఆ పరీక్ష రాసారు.తాజాగా ఈ పరీక్షకి సంబంధించిన రిజల్ట్ వచ్చింది.
ఈ ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.అనుభవ్కు 298.3744 మార్కులు రాగా.విభా సింగ్కు 283.9151 మార్కులు వచ్చాయి.ఊహించని విధంగా భార్య భర్తలు ఇద్దరికి ఒకటి, రెండు ర్యాంకులు రావడం ఇప్పుడు వీళ్ళిద్దరూ హాట్ టాపిక్ గా మారిపోయారు.