ఇన్నాళ్లు ప్రపంచ దేశాలను శాషించేందుకు శతవిధాలుగా ప్రయత్నించిన చైనా అమెరికాను క్రాస్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.అమెరికాతో పడ్డ చైనా ఇప్పుడు కరోనా వల్ల విలవిలలాడిపోతుంది.
ప్రపంచ దేశాలు చైనాను ప్రస్తుతం బహిష్కరించాయి.అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
ఒకరితో ఒకరు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు.ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా బతికేస్తున్నారు.
చైనాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
చైనా ప్రజల్లో సంతోషం కనుమరుగయ్యింది.ఒకప్పుడు జీవితాన్ని ఆస్వాదించిన వారు ఇప్పుడు జీవితం ఉంటే చాు అనుకునే పరిస్థితి వచ్చింది.గతంలో ఒక సర్వే ప్రకారం చైనా వారు జీవితాన్ని అత్యంత ఆస్వాధిస్తారు, వారి ఆహారపు అలవాట్లు మరియు వారి పని దినాలు అన్ని కూడా వారిని ఆనందంగా ఉంచాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాని ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్దంగా ఉంది.చైనాలో ఈమద్య కాలంలో వేడుకలు అనేవి చాలా తక్కువ అయ్యాయి.బర్త్డే పార్టీలు, యానివర్శిలు మరియు పెళ్లి వేడుకలు అక్కడక్కడ మాత్రమే జరుగుతున్నాయి.
అవి కూడా ఆంక్షల మద్య జరుగుతున్నాయి.ఏవైనా వేడుకలు జరిగితే గంటలకు మించి జరుగకూడదు అంటూ స్థానిక అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో విందు అనేది లేనే లేదు.
బయటి ప్రాంతాల్లో ఆహార పదార్థాలు తినడం లేదా తయారు చేయడం అనేది పూర్తిగా నిషేదించారట.ఇటీవల ఒక పెళ్లికి సంబంధించిన విషయం వైరల్ అవుతుంది.
ఆ పెళ్లి అత్యంత విచిత్రంగా సాగింది.పెళ్లికి వైరస్ భయంతో తక్కువ సంఖ్యలో జనాలు వచ్చారు.
వచ్చిన వారు కూడా దాదాపు అంతా మాస్క్లు ధరించి ఉన్నారు.పెళ్లి వేడుక ప్రారంభం అయిన 20 నిమిషాల్లో అక్కడకు అంతా చేరుకున్నారు.
పెళ్లి తంతు గంటలో ముగిసింది.
గంట తర్వాత అక్కడ ఒక పెళ్లి జరిగిందా అన్నట్లుగా లేదు.వధువు వరుడితో సహా అంతా అక్కడ నుండి వెళ్లి పోయారు.బహిరంగ ప్రదేశాల్లో ఉండటమే లేదు.
అధికారులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ జనాలను బయట ఉండనివ్వడం లేదు.ఇక రోడ్లపై ట్రాఫిక్ గతంతో పోల్చితే 70 శాతం తగ్గినట్లుగా స్థానికులు చెబుతున్నారు.