పెళ్లి జరగడం లేదని బాధపడేవారికి వరంలా మారుతాయి మాట్రిమోని ఆఫీసులు.అక్కడ తమ అభిరుచికి తగ్గ వధువు, వరుడుని ఎంచుకుంటారు.
అయితే పెళ్లిల్లు కుదిర్చే ఓ పెళ్లిల్ల పేరమ్మ ఓ కొత్త పెళ్లికొడుకు తల పగలగొట్టిన ఘటన కర్నూలు జిల్లాలోని నంద్యాలలో చోటు చేసుకుంది.ఫరూక్ నగర్కు చెందిన షేక్ హుసేన్ భాషా తన పెళ్లి చేయాలంటూ ఖాజామీ అనే పెళ్లిల్ల బ్రోకర్ను కోరాడు.
దీంతో ఆమె పోలురుకు చెందిన ఓ యువతితో హుసేన్ భాషా వివాహం జరిపించింది ఖాజామీ.అయితే ఈ పెళ్లి జరిపించినందుకు ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు హుసేన్ భాషా.కానీ అది తనకు చాలదని, తనకు మరో రూ.10వేలు ఇవ్వాలని ఖాజామీ కోరింది.అయితే తన వద్ద డబ్బులేదని చెప్పి హుసేన్ భాషా తన అత్తారింటికి వెళ్లాడు.ఇది తెలుసుకున్న ఖాజామీ, పోలురుకు వెళ్లి హుసేన్ భాషాతో గొడవకు దిగింది.
తనకు డబ్బులివ్వలేనని హుసేన్ భాషా తేల్చి చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఖాజామీ కర్ర తీసుకుని హుసేన్ భాషా తలపై దాడి చేసింది.దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
కాగా ఖాజామీపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.