డిసెంబర్ 1 న ములుగు జిల్లా ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ ఇటీవల విడుదల అయిన లేఖపై భారత మావోయిస్టు పార్టీ స్పందించింది.ప్రజా ద్రోహులు, ఇన్ఫార్మర్లు ఖబడ్దార్ అంటూ లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరుతో మావోలు కొత్త లేఖను విడుదల చేశారు.గతంలో వచ్చిన ప్రకటనతో తమకు సంబంధం లేదని మావో పార్టీ తెలిపింది.
ఆ ప్రకటనను ప్రజలెవరూ నమ్మొద్దని రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ వెల్లడించారు.కొంతమంది తమ స్వార్థం కోసం మావోయిస్టు పార్టీ పేరును వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలు ఉంటే స్థానిక కమిటీలు ప్రకటనలు చేస్తాయని భారత మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.