బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టుల బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది.మావోయిస్ట్ సింగరేణి కోల్ బెల్ట్ పేరుతో లేఖ వచ్చిందని తెలుస్తోంది.
ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో మావోయిస్టులు తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదంటూ లేఖలో హెచ్చరించారు.