ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు.నారాయణపూర్ జిల్లా కడేనార్, మండోదా అటవీ ప్రాంతం గుండా వెళ్లుతున్న పోలీసు వాహనాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గాలింపుకు వెళ్లిన జవాన్లు పోలీసులు వాహనంలో తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఒక్కసారిగా తుపాకులతో బస్సుపై విరుచుకుపడి కాల్పులకు తెగబడినట్టు ఛత్తీస్గడ్ డీసీపీ తెలిపారు.
కాగా ఈ ఘటనలో బస్సులో ప్రయాణం చేస్తున్న డీఆర్జీ విభాగానికి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
గాయపడ్డవారిని రాయపూర్ కి తరలించి చికిత్స అందిస్తున్నారట.
ఇకపోతే బస్సు ప్రమాద ఘటన జరిగిన సమయంలో అందులో మొత్తం 25 మంది జవాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది.
కాగా గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.