ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.వీరిలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపి మంత్రి గుమ్మనూరు జయరామ్, మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ ఉన్నారు.
వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.