వి.ఐ.పి విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహా,ఏపి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,సినీనటులు విజయ్ దేవరకొండ,ఆనంద్ దేవరకొండలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపల ఏపిమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.గరుడ సేవ సందర్భంగా ఏపి సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించున్నారని,అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశాంమన్నారు.
కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.